Electric AC Buses: హైదరాబాద్‌-విజయవాడ రూట్ లో రేపటినుంచి ‘ఈ-గరుడ’ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు

తెలంగాణా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులు ఈ-గరుడ పేరుతో మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని తెలంగాణా స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఆర్‌టీసీ) నిర్ణయించింది.

  • Written By:
  • Updated On - May 15, 2023 / 07:55 PM IST

Electric AC Buses: తెలంగాణా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులు ఈ-గరుడ పేరుతో మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని తెలంగాణా స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఆర్‌టీసీ) నిర్ణయించింది. మంగళవారం ఈ రూట్‌లో 10 ఈవీ బస్సులను ప్రారంభించనున్నారు.

విజయవాడ రూట్ లో 20 నిమషాలకో బస్సు..(Electric AC Buses)

మిగిలిన 40 ఈవీ బస్సులు ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ప్రయాణం పర్యావరణ ప్రయోజనాలతో పాటు విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయాణీకులకు మెరుగైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రతి 20 నిమిషాలకు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు సోమవారం తెలిపారు.

వచ్చే రెండేళ్లలో 1860 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..

రానున్న రెండేళ్లలో 1860 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని, ఇందులో హైదరాబాద్ నగరంలో 1300 బస్సులు, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడపనున్నట్లు తెలంగాణా ఆర్టీసీ కార్పొరేషన్ తెలిపింది. అవి కాకుండా రాబోయే నెలల్లో హైదరాబాద్‌లో మొత్తం 10 డబుల్ డెక్కర్ బస్సులు నడపనున్నాయి.ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం మంగళవారం మియాపూర్ క్రాస్ రోడ్స్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో జరగనుంది.