Etela Rajender Sensational Comments About Kaleshwaram Notices: కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తనకు అందలేదని చెప్పాడు. బిజినెస్ రూల్స్ తెలియకుండా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. ఆర్థికమంత్రిగా ఆనాడు డబ్బు కేటాయించడం మాత్రమే నా పని అంటూ వెల్లడించారు.
కాళేశ్వరం అక్రమాలతో నాకేలాంటి సంబంధం లేదని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కక్షసాధింపు చర్యలతో కేసీఆర్ ఏమీ చేయలేకపోయారని, రేవంత్ మాత్రం ఏం చేయగలరని ప్రశ్నించారు.
కాళేశ్వరం విచారణ వెనుక నిజాయితీ, చిత్తశుద్ధి కనిపించడం లేదని ఈటల అన్నారు. కనీస ప్రాథమిక విచారణ చేసుకోకుండానే నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. నోటీసులు ఎవరికీ ఇవ్వాలో కూడా తెలియదా? అన్నారు.