Site icon Prime9

Revanth Reddy: అమెరికా ఒత్తిడికి మోదీ లొంగిపోయారు.. సీఎం రేవంత్ కామెంట్స్

Revanth Reddy

Revanth Reddy

PM Modi: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం దేశవ్యాప్తంగా నిరసలు మిన్నంటాయి. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దాడుల్లో 100 మందికిపైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు హతమయ్యారు.

 

ఆపరేషన్ సిందూర్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ పై దాడులు చేసింది. వీటిని భారత రక్షమ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కోంది. అయితే భారత్ కూడా పాకిస్తాన్ పై దాడులు చేసింది. దాడుల్లో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తట్టుకోలేని పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి.

 

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లతో ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ ను ముగించారని ఆరోపించారు. వచ్చిన అవకాశాన్ని మోదీ చేజార్చుకున్నారని.. ట్రంప్ కు తలొగ్గాడని విమర్శించారు. పహల్గామ్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అందరం ప్రధాని మోదీకి, కేంద్రానికి అండగా నిలబడ్డామని చెప్పారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీని దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తుచేసుకున్నారని తెలిపారు.

 

రాహుల్ గాంధీని నిందించి.. కిషన్ రెడ్డి చేతగాని తనాన్ని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. పహల్గామ్ ఘటన తర్వాత మొదట బయటకు వచ్చింది తామేనని, అప్పుడు కిషన్ రెడ్డి ఇంట్లో ఏమీ జరగనట్టు నిద్రపోతున్నారని అన్నారు. మీ గొప్పలు చెప్పుకోవడానికి ఇతరులపై నిందలు వేయడం సరికాదన్నారు.

 

భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ గాంధీని స్మరించుకోవడమంటే తీవ్రవాదం మీద పోరాటం చేయడమేనని అన్నారు. ఆర్థిక సరళీకృత విధానాలకు మూలం రాజీవ్ గాంధీ అన్నారు.

 

కానీ 1971లో పాకిస్తాన్ పై యుద్ధం చేసిన ఇందిరా గాంధీని గుర్తు చేసుకున్నామని అన్నారు. పాకిస్తాన్ కు ఇందిరా గాంధీ గట్టి గుణపాఠం చెప్పారని తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ముసుగులో వచ్చిన వారిని ఇందిరా గాంధీ నియంత్రించారని, పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం కోసం వచ్చిందని గుర్తుచేశారు. కానీ తెల్లరంగు వారి అజమాయిషీ అవసరం లేదని చెప్పారని అన్నారు.

Exit mobile version
Skip to toolbar