Prime9

Minister Harishrao: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంది

Hyderabad: ఏపీ ప్రభుత్వ తీరు పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, ఉపాద్యాయులపై కర్కశంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కేసులు పెడుతూ,  జైల్లో వేస్తున్నారని మంత్రి హరీష్ మాట్లాడారు. తెలంగాణాలో వారి పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉందంటూ కితాబులిచ్చుకొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 5సంవత్సరాల్లో 73శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీదంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో హరీశ్ రావు ఈ మాటలు అన్నారు.

ఇది కూడా చదవండి:Minister Peddireddy: వ్యవసాయ విద్యుత్ మీటర్ల పై మంత్రి పెద్దిరెడ్డి సంచలన ప్రకటన

Exit mobile version
Skip to toolbar