Prime9

Gudem Kotha Veedhi: అడవిదున్నమాంసాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని పట్టుకున్న జీకే వీధి పోలీసులు

 Gudem Kotha Veedhi: మన్యం జిల్లా , హితుగూడెం దగ్గర అడవిదున్నమాంసాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ని పోలీస్ లు పట్టుకున్నారు . ఒరిస్సా లోని మల్కనగిరి ప్రాంతానికి చెందిన 13మంది వ్యక్తులు 7ద్విచక్ర వాహనాలు పై13 గోనె మూటలుతో ‘అడవి దున్న ఎండిన మాంసాన్ని తరలిస్తుండగా జీకే వీధి పోలీసు పట్టుకున్నారు.

గ్రామస్థులు ఇచ్చారని ..( Gudem Kotha Veedhi)

.అడవిదున్న వన్య మృగం జాబితాలో వుంది దింతో దాన్ని చంపడం నేరం . ఈ మేరకు పోలీస్ లకు ముందస్తు సమాచారం అందింది . దింతో పోలీసులు జీకే వీధి రహదారి వద్ద వారిని అడ్డగించి పట్టుకున్నారు . వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియపరచి నిందితులను వాళ్లకు అప్పగించారు . వలలను ఆర్ వి నగర్ డివిజనల్ అటవీ అధికారి కార్యాలయానికి పారెస్టు అధికారులు తరలించారు . పదమూడు మంది నిందుతులని అటవీ శాఖ అధికారులు విచారించారు . వాళ్లంతా వారం రోజుల క్రితం జీకే వీధి పరిధిలోని ఎర్రగడ్డ ఏరియా వచ్చినట్లు తెలిపారు . ఆ ప్రాంతంలోని ఒక కొండ దగ్గర పాక లో ఉన్నట్లు చెప్పారు . పక్కనే ఉన్న గ్రామస్థులు ‘అడవి దున్న మాంసం పట్టుకొచ్చి తమకి ఇచ్చినట్లు తెలిపారు . ఆ మాంసాన్ని పట్టికెళ్తున్నట్లు వివరించారు . ఈ సందర్భంగా అర్వినగర్ అదనపు డి ఎఫ్ ఓ శ్రీనివాసరరావు మాట్లాడుతూ 7ద్విచక్రవాహనాలను సీజ్ చేసి,13మంది నిందుతులను రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar