Mp Avinash Reddy : సీబీఐ విచారణను కాదని పులివెందులకు వెళ్తున్న ఎంపీ అవినాష్.. కారణం ఏంటంటే?

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  నేడు మళ్ళీ సీబీఐ విచారణకు దూరమయ్యారు. అయితే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తల్లికి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరారు. ఈ మేరకు తల్లికి అనారోగ్యం కారణంగా

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 01:44 PM IST

Mp Avinash Reddy : డప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  నేడు మళ్ళీ సీబీఐ విచారణకు దూరమయ్యారు. అయితే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తల్లికి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరారు. ఈ మేరకు తల్లికి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ పంపారు. వైఎస్ అవినాష్ రెడ్డి నుండి సమాచారం రాగానే  సీబీఐ అధికారుల బృందం తమ కార్యాలయం నుంచి కారులో బయలుదేరారు. వైఎస్ అవినాష్ రెడ్డి పంపిన లేఖపై సీబీఐ అధికారులు అనుమతిస్తారా  లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.