Prime9

Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పరిశ్రమల మీటింగ్ కు హాజరు

AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ వేదికగా రేపు భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక సమావేశం జరగనుంది. రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో నిర్వహించనున్నారు.

 

అందులో భాగంగా పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవల్సిన చర్యలపై.. సమావేశంలో చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఏపీ రావల్సిన నిధులు, బకాయిలపై, పథకాలకు ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు పరిశ్రమల శాఖకు చెందిన పలువురు ఉన్నాతాధికారులు కూడా సీఎం వెంట వెళ్లనున్నట్టు సమాచారం.

Exit mobile version
Skip to toolbar