AP Deputy CM Pawan Kalyan Fifty Lakhs to Indian Jawan Murali Nayak Family : ఏపీకి చెందిన వీర జవాన్ మురళీనాయక్ దేశ సరిహద్దుల్లో మరణించారు. ఈ మేరకు మురళీ నాయక్ అంత్యక్రియలను అనంతపురం జిల్లాలో ఇవాళ చేయనున్నారు. ఇందులో భాగంగానే వీరజవాన్ మురళీనాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, సవిత, అనగానిలు నివాళులర్పించారు. అనంతరం జవాన్ కుటుంబాన్ని పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ మేరకు కళ్లతండాలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఐపీల రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి పవన్ కల్యాణ్ భారీ ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు వారికి రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయం నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం, కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం, ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.25లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
జవాన్లు బార్డర్లో పోరాడుతున్నారని, అందుకే మనం ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. పాక్ సరిహద్దుల్లో జవాన్ మురళీనాయక్ చనిపోవడం బాధాకరమని, చిన్న వయసులో వీరమరణం పొందడం కలిచివేసిందన్నారు. వీరజవాన్ మురళీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. జవాన్ మురళీనాయక్ మృతదేహంపార్థివదేహం వద్ద నివాళులర్పించి సెల్యూట్ చేశారు. ఆయనతో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, ప్రసాద్ ఉన్నారు.