Anchor Anasuya : నోరుంది కదా అని వాగడం కాదు.. నీ బ్రతుకు ఏంటో గతంలో ఒకసారి చూసుకోవాలంటూ “ఆంటీ” కి సెటైర్లు..

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు. 

  • Written By:
  • Publish Date - May 11, 2023 / 07:39 PM IST

Anchor Anasuya : నోరుంది కదా అని వాగడం కాదు.. నీ బ్రతుకు ఏంటో గతంలో ఒకసారి చూసుకోవాలి..

కొంచెం ఫేమస్ అయ్యాక ఇంత బ** ఎందుకు..

ఇవే తగ్గించుకుంటే బాగుంటది..

మీడియా, సోషల్ మీడియా గురించి మాట్లాడే అర్హత లేని *******

ఆంటీ ఇంకెన్నాళ్ళు ఈ పబ్లిసిటీ స్టంట్లు..

మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశారో గుర్తు తెచ్చుకోండి..

ముందు సరిగ్గా బట్టలు వేసుకోవడం నేర్చుకో..

ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో చూడండి..

జబర్దస్త్ లో ఎలా పైకి వచావో గుర్తు లేదా..

అసలు తెలుగు యాంకరింగ్ ని బ్రష్టు పట్టించావ్..

జబర్దస్త్ లో ఏం చేశావో గుర్తు లేదా..

ఇవన్నీ సదరు ఒక తెలుగు యాంకర్ గురించి నెటిజన్లు కామెంట్ల రూపంలో ఇస్తున్న ట్రోలింగ్స్.. చదవడానికి, రాయడానికి కూడా అసభ్యంగా అనిపిస్తున్న కొన్ని కామెంట్లు ఇక్కడ రాయలేకపోతున్నాం. సోషల్ మీడియా వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికీ గత కొద్ది రోజులుగా అనసూయ – విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు అది విజయ్ ఫ్యాన్స్ తో పాటు సదరు సామాన్య ప్రజలు కూడా విమర్శించేలా మారింది.

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు. ఇక యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు, అన‌సూయకు  మధ్య ఎప్ప‌టి నుంచో మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. వీరిద్దరి మధ్య ఈ మాట‌ల యుద్ధం ఇప్ప‌టిదీ కాదు. అర్జున్ రెడ్డి స‌మ‌యం నుంచి జ‌రుగుతుంది. ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలో వాడిన ఓ బూతు పదంపై మన స్టార్ యాంకర్ విమర్శలు చేసింది. దానికి విజయ్ దేవరకొండ సైతం ఆమెపై విమర్శలు చేశాడు. ఆ తర్వాత లైగర్ సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇది కొనసాగింది. లైగర్ ఫ్లాప్ అయినప్పుడు కూడా అనసూయ, విజయ్ దేవరకొండను టార్గెట్ చేసింది. అప్పుడు రౌడీ స్టార్స్ ఫ్యాన్స్ అనసూయపై విరుచుకుపడింది. ఆమె కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఆ పోస్ట‌ర్‌లో హీరో హీరోయిన్ల పేర్లు వేశారు మేక‌ర్స్‌. అంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు ముందు ‘ది’ అని రాశారు. అయితే అలా రాయటాన్ని అనసూయ పరోక్షంగా విమర్శించింది. ఈ మేరకు ట్విట్టర్ లో ‘బాబోయ్ ‘ది’ అంట.. పైత్యం.. అంటకుండా చూసుకుందాం’ అని పోస్ట్ చేసింది. దీంతో రౌడీ బాయ్ విజయ దేవరకొండ ఫ్యాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ లో అతనికి ఉన్న హై క్రేజ్ గురించి తెలిసిందే. దీంతో వాళ్ళంతా అన‌సూయ‌ను ట్రోల్ చేయ‌టం స్టార్ట్ చేశారు. అయితే అన‌సూయ కూడా త‌గ్గేదే లే అనేలా రియాక్ట్ అయ్యింది. అయితే తాజాగా అనసూయ మీడియాపై ఫైర్ అయ్యింది. మీడియాపై కొంచెం ఎక్కువగానే నోరు పారేసుకుంది. ఉప్పూకారం తింటే నిజాలు రాయండి.. దమ్మూ ధైర్యం ఉంటే.. ఇలాంటివి రాయండి అంటూ రెచ్చిపోయింది.

 

లైవ్ లో అనసూయ ఏం మాట్లాడింది అంటే (Anchor Anasuya)..

ఈ మేరకు లైవ్ లో మాట్లాడిన అనసూయ.. ఇక అంతే కాకుండా ” మాలాంటి పబ్లిక్ ఫిగర్స్, పేరున్న వాళ్ళు, ఫేమస్ అయితే ఫేమస్ అయినవాళ్లు.. వాళ్ళ మీదే రాస్తూ పొట్ట నింపుకొనేవాళ్ళ కోసం చెప్తున్నాను.. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయను వేసుకున్నారు.. ఆ హీరో ఫ్యాన్స్ అనసూయను ఏడిపిస్తున్నారు.. వంటపడ్డారు.. ట్రోల్ చేశారు.. కాదు.. మీకు ఇంకా దునియా దారి తెలియదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు.. అన్నవాడి నోరు కంపు. మీకు దైర్యం ఉంటే.. ఉప్పుకారాలు తిని ఉంటే.. నిజం రాయండి. నేను దైర్యంగా నా అభిప్రాయం చెప్పడం జరిగింది. చేతకాని వాళ్ళు అదుపు తప్పారు.. ఇది రాయాల్సింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

మన మాటల్లో నిజం ఉండాలి.. చెప్పేవి కరెక్ట్ గా చెప్పాలి.. కానీ అటు ఇటు కాకుండా కొన్ని సార్లు చేసే పనుల వల్ల ఇలాంటివి ఎదురవుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ముఖ్యంగా తెలుగు హీరోయిన్లు.. బాలీవుడ్ కి వెళ్ళాక తెలుగు వాళ్ళని తక్కువ చేయడం.. కొంచెం ఫేమ్ వచ్చాక అందరూ మీడియా ని అందం కామనే అని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు.