Site icon Prime9

High Court: తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వరా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

high court

high court

Group-1: గ్రూప్- 1 పరీక్ష వివాదంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ధర్మాసనం కమిషన్ ను పలు అంశాలపై ప్రశ్నించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మృతభాషకు ప్రాధ్యాన్యత ఇస్తుంటే.. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంగ్లీష్ మాట్లాడే వారికే ఎందుకు ఇస్తున్నారని కోర్టు అడిగింది. తెలుగు పరీక్ష రాసిన వారికి మార్కులు తక్కువగా వచ్చాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. దీనిపై కమిషన్ తగిన కారణాలను చెప్పాలని సూచించింది. మార్కుల కేటాయింపులో ఎలాంటి నిబంధనలు పాటించారో చెప్పాలని ఆదేశించింది.

కాగా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొయిన్స్ పేపర్ వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని, ర్యాంకుల కేటాయింపు సవ్యంగా లేదని.. అందుకే మరోసారి పేపర్లను మరోసారి కరెక్షన్ చేయించాలని కోరారు. ఈ మేరకు పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ అంశంపై కమిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆన్సర్ పేపర్స్ వాల్యుయేషన్ అంతా పారదర్శకంగానే జరిగిందని చెప్పారు. నిపుణుల ఆధ్వర్యంలోనే ప్రక్రియ నిర్వహించామని వాదనలు వినిపించారు. మరోవైపు గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ వ్యవహారంపై తగిన విచారణ చేయాలని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar