Site icon Prime9

Jharkhand: జార్ఖండ్‌లో బోటు బోల్తాపడి 8 మంది గల్లంతు

Jharkhand: జార్ఖండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బోటు బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది జలసమాధి అయ్యారు. కోడెర్మా జిల్లాలోని రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం సమేతంగా పంచఖేరో డ్యామ్‌కు వెళ్లారు. అనంతరం అందరూ కలిసి పడవలో షికారుకు వెళ్లారు. జలాశయం మధ్యకు వెళ్లేసరికి బోటులోకి ఒక్కసారిగా నీళ్లు రావడంతో బోల్తాపడింది. పడవ నడిపే వ్యక్తితోపాటు బాధిత కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్ ఒడ్డుకు చేరుకోగా, మిగతా ఎనిమిది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఏడుగురు 18 ఏళ్లలోపు వాళ్లే ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం డ్యామ్‌లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

Exit mobile version
Skip to toolbar