Site icon
Prime9

India – Pakistan War: చైనా పాకిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అసలు కారణం ఇదే..!

Why china Helping to Pakistan during the India - Pakistan War

Why china Helping to Pakistan during the India - Pakistan War

Why China Helping to Pakistan during the India – Pakistan War: పహెల్‌గాం ఉగ్రదాడి నేపథ్యంలో మెజారిటీ ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలిచాయి. అరకొర దేశాలు మాత్రమే పాకిస్తాన్ కు మద్దతు పలికాయి. వీటిలో చైనా చాలా ముఖ్యమైనది. సుంకాల విషయంలో అమెరికాతో చైనా నువ్వా నేనా అనే స్థాయిలో పోరాటం జరుపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో సుంకాల సమరానికి ఇటీవల భారత్ సాయాన్ని అర్థించింది డ్రాగన్ కంట్రీ. అలాంటి చైనా ప్రస్తుతం పాకిస్తాన్ అనుకూల శిబిరంలో చేరింది. పాకిస్తాన్ ను చైనా జై కొట్టడంలో మతలబు ఏమిటి..?

 

చైనా వైఖరీ:

చైనాది ఎప్పుడూ వంకర బుద్ధే. పదేపదే భారత్ పై అకారణంగా ద్వేషం చిమ్మడం డ్రాగన్ కంట్రీకి అలవాటుగా మారింది. అంతేకాదు నోరు తెరిస్తే చాలు.. అంతులేని అబద్ధాలు. నరం లేని నాలుకలా మాట్లాడినట్లు.. ఎలా పడితే అలా అబద్ధాలు ఆడేస్తుంటుంది డ్రాగన్ కంట్రీ.

 

భారత్ – చైనా సరిహద్దు వివాదాలు

భారత్ – చైనా మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ చైనా చాలా కాలం నుండి ప్రచారం చేసుకుంటూ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ తమ భూభాగమని ఎన్నిసార్లు  చెప్పినా, చైనా వినిపించుకోవడం లేదు. అరుణాచల్ ప్రదేశ్‌ తమదేనంటూ చైనా పనికిమాలిన వాదనలు చేస్తోంది. కాగా చైనా వాదనను భారత్ దీటుగా తిప్పికొట్టింది. ఎలాంటి ఆధారాలు లేని ఈ వాదనలను ఎన్ని సార్లు నొక్కి వక్కాణించిన.. ఫలితం లేదని భారత్ చైనాకు తేల్చి చెప్పేసింది.

 

చైనా నియంతృత్వ పోకడలు..

కొంతకాలంగా భారత్‌ పట్ల చైనా కక్షతో వ్యవహరిస్తోంది. దీనికి ఒక ప్రధాన కారణం.. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది భారతదేశమే. ఇక్కడ డ్రాగన్ చైనా కుయుక్తులను అర్థం చేసుకోవడం అవసరం. ఆసియాలో చైనా నియంతృత్వ పోకడలు పోతోంది. ఆసియాలో పెద్దన్న పాత్ర పోషించడానికి చైనా తహతహలాడుతోంది. అయితే చైనా పెత్తందారీతనాన్ని భారత్ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో భారత్ ను దెబ్బకొట్టే ఎలాంటి అవకాశం లేక.. చైనా భారత్ ను అన్నీ విధాల టార్గెట్ చేస్తుంది.

 

ఇతర దేశాల రాజకీయాల్లో చైనా జోక్యం..

ఆసియాలో తన మాటే చెల్లుబాటు కావాలంటే ముందుగా భారతదేశాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆసియాలోని చిన్న చిన్న దేశాలను నయానో.. భయానో తమ మాటవినేలా చేసుకుంటోంది డ్రాగన్ చైనా. ఇరుగుపొరుగు దేశాలు తమ ఆదేశాలు వినేటట్లు చేసే విద్యలో చైనా ఆరితేరింది. కొంతకాలం కిందట మాల్దీవులను చైనా బుట్టలో పడేసింది. వాస్తవానికి మొదటి నుంచి భారత్‌కు మాల్దీవులు మిత్రదేశం.. అయితే మెల్లమెల్లగా మాల్దీవుల రాజకీయాల్లో డ్రాగన్ చైనా జోక్యం ప్రారంభమైంది. దీని ఫలితంగా మాల్దీవుల సర్కార్‌, భారత్ వ్యతిరేక వైఖరి తీసుకోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌ – మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమైంది.

 

భారత్ చుట్టూ ఉన్న దేశాలతో చైనా దోస్తీ

మొదట చైనా పాకిస్తాన్‌తో ఈ ఆట మొదలెట్టి ఆర్థికంగా దివాళా తీసేదాకా నిద్రపోలేదు. పాకిస్తాన్ రోడ్డున పడ్డాక, ఆ దేశాన్ని వదిలేసింది. ఆ తరువాత శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్ ఇలా అన్ని దేశాలపై చైనా కన్నేసింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ దేశాలకు భారీ ఎత్తున సొమ్ములు ఇస్తామని ఆశ పెట్టి తన శిబిరంలోకి లాక్కునే ప్రయత్నాలు చైనా నిరంతరం చేస్తోంది.

 

చైనాకి చెక్

అయితే భారతదేశం అడుగడుగునా అడ్డుతగలడంతో ఆసియా పై భారతదేశం పూర్తి స్థాయి పెత్తనం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఏదో ఒక రూపంలో భారత్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బహిరంగంగా భారత్ వ్యతిరేక వైఖరి తీసుకుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి జై కొట్టింది.

 

Exit mobile version
Skip to toolbar