Fire in Maldives: మాల్దీవుల్లో అగ్నిప్రమాదం.. 9 మంది భారతీయుల మృతి

మాల్దీవుల రాజధాని మాలేలో విదేశీ కార్మికుల లాడ్జిలో గురువారం మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 12:45 PM IST

Maldives: మాల్దీవుల రాజధాని మాలేలో విదేశీ కార్మికుల లాడ్జిలో గురువారం మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మాలే ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి.

గ్రౌండ్ ఫ్లోర్ వెహికల్ రిపేర్ గ్యారేజీ నుంచి వచ్చిన మంటల్లో ధ్వంసమైన భవనం పై అంతస్తు నుంచి 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మంటలను ఆర్పడానికి తమకు నాలుగు గంటల సమయం పట్టిందని తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఉన్నారని భద్రతా అధికారి తెలిపారు

ఇలా ఉండగా మాల్దీవుల్లో విదేశీ కార్మికుల పరిస్థితి పై రాజకీయపార్టీలు విమర్శలు గుప్పించాయి. మాలేలో 250,000 జనాభా ఉండగా వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంకకు చెందినవారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో స్థానికులతో పోలిస్తే విదేశీ కార్మికులలో సంక్రమణ మూడు రెట్లు వేగంగా వ్యాపించింది.