Rishi Sunak: బ్రిటన్ ప్రజల కోసం రాత్రింబవళ్లు పనిచేస్తాం.. నూతన ప్రధాని రుషి సునాక్

బ్రిటన్‌ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రధాన అజెండా అని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అన్నారు.

London: బ్రిటన్‌ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రధాన అజెండా అని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అన్నారు. ప్రధానిగా నియమితులైన తర్వాత రిషి మాట్లాడుతూ, కన్జర్వేటివ్‌ పార్టీ ప్రతి దశలో పారదర్శకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అందరితో కలిసి దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు మావంతు కృషి చేస్తాం. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. యూకే ప్రజల ఉన్నతి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తామంటూ రిషి సునాక్‌ పేర్కొన్నారు. కొత్త ప్రధాని రుషి సునాక్ రాకను ప్రపంచలంలోని పలు దేశాధినేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Rushi Sunak: కొత్త యుకె ప్రధాని రుషి సునాక్.. భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి బ్రిటన్ పార్లమెంటేరియన్..