Nayanthara Confirmed in Chiranjeevi and Anil Ravipudi Movie: మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే.. అనిల్ రావిపూడితో సినిమాను లైన్లో పెట్టారు. ఇటీవల మూవీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ సినిమా సౌత్ బ్యూటీ నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్టు కొన్ని రోజులు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్సే నిజం చేస్తూ తాజాగా మెగా157 (Mega 157) నయనతార ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఈ విషయాన్ని మూవీ టీం ప్రకటించింది. నయన్తో ఓ స్పెషల్ వీడియో తీసి షేర్ చేశారు. జూన్లో ప్రారంభం కానున్న షూటింగ్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత నయన్ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. బ్లాక్బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మేరకు షైన్ స్క్రిన్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది.
భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందనున్న ఈ మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం నయన్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది. సుమారు రూ. 18 కోట్ల వరకు ఆమె పారితోషికం డిమాండ్ చేసిందనే టాక్ వినిపించింది. జవాన్ చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచిందనే టాక్ వినిపించింది.
ఇప్పటివరకు ఆమె అత్యధికంగా రూ. 10 కోట్లు తీసుకున్న ఆమె చిరంజీవి సినిమా కోసం ఇంత డిమాండ్ చేయడమేంటని అంతా షాక్ అయ్యారు. ఈ విషయంలో మెగా అభిమానులు ఆమె ట్రోల్ చేశారు. కానీ, చిరుతో కలిసి సినిమాల చేయాలని ఆసక్తిగా ఉన్న రూ. 6 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తాజాగా వినిపిస్తున్న టాక్. కాగా గతంలో నయన్, చిరంజీవిలు గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. ఇందులో నయన్.. చిరుకు చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. తెలుగు చివరిగా నటించి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక గాడ్ ఫాదర్ తర్వాత ఆమె చిరంజీవి సినిమాతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది.