Manjima Mohan: “కడలి” హీరోతో.. “నాగచైతన్య” హీరోయిన్ పెళ్లి

నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి మంజిమా మోహన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. వరుడు మరెవరో కాదండి కోలీవుడ్‌ సీనియర్‌ స్టార్, "సీతాకోక చిలుకలు" మూవీ ఫేమ్ కార్తీక్‌ తనయుడు, "కడలి" చిత్రం హీరో గౌతమ్‌ కార్తీక్‌.

Manjima Mohan: నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి మంజిమా మోహన్. ఆ సినిమాను ప్రేక్షకులు అంతగా ఆదరించకపోవడం వల్ల మంజిమాకు తెలుగులో పెద్ద ఆఫర్స్ రాలేదు. కానీ తమిళ, మలయాళం మాత్రం వరుస మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. అయితే తాజాగా ఈ నటి త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది.

వరుడు మరెవరో కాదండి కోలీవుడ్‌ సీనియర్‌ స్టార్, “సీతాకోక చిలుకలు” మూవీ ఫేమ్ కార్తీక్‌ తనయుడు, “కడలి” చిత్రం హీరో గౌతమ్‌ కార్తీక్‌. ఈ విషయాన్ని మంజిమా మోహన్‌ ఇన్‌స్టా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ‘దేవరాట్టం’ సినిమా మొదలు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నరన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమ ప్రేమను సోమవారం ఇన్‌స్టా ద్వారా తమ అభిమానులకు అధికారికంగా వెల్లడించారు. వీరి వివాహం ఇక ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: ఈ వారంలో పది సినిమాలు రిలీజ్