Prime9

Tirumala: కిక్కిరిసిన తిరుమల.. భారీగా భక్తుల దర్శనం

Piligrims: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ఓ వైపు వేసవి ముగిసే సమయం దగ్గర పడుతుండడం, రైతులు, ప్రజలు వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతుండటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్నందున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది.

 

కాగా నెలరోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ క్లాంపెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న అర్ధరాత్రి వరకు శ్రీవారిని 78,631 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.29 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.

Exit mobile version
Skip to toolbar