Site icon Prime9

IPL 2025 22nd Match: ఆర్య మెరుపు సెంచరీ.. చెన్నైపై పంజాబ్ ఘన విజయం

Punjab Kings won by 18 runs

Punjab Kings won by 18 runs

Punjab Kings won by 18 runs, Punjab Kings vs Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 220 పరుగులు లక్ష్యఛేదనలో చెన్నై 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్‌లో పంజాబ్ మూడో విజయం సాధించగా.. చెన్నై‌కు నాలుగో ఓటమి. ఇక, పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో ఉండగా.. చెన్నై 9వ స్థానానికి పరిమితమైంది.

 

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్(0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్(9), స్టాయినిస్(4), వధేరా(9) మ్యాక్స్ వెల్(1) వరుసగా పెవిలియన్ చేరారు. 8 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్ కింగ్స్‌ను ప్రియాంశ్ ఆర్య(103, 42 బంతుల్లోనే 7ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో ఆదుకున్నాడు. చివరిలో శశాంక్(52, 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేయడంతో పంజాబ్ 219 పరుగుల భారీ స్కోరు చేసింది.

 

220 పరుగుల భారీ లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ సింగ్స్ 20 ఓవర్లలో 20 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. డెవవాన్ కాన్వే(69), రచిన్ రవీంద్ర(36), శివమ్ దూబె(42), ధోనీ(27) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఠాకూర్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.

 

Exit mobile version
Skip to toolbar