Lucknow Super Giants Won The Match Against Gujarat Titans: ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. గుజరాత్పై ఏకంగా 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక, ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానం దక్కించుకోవాలని భావించినా గుజరాత్ టీంకు లక్నో ఝలక్ ఇచ్చింది.
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో మొదట బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్(117) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 64 బంతుల్లో 117 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మార్క్రమ్(36) మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 91 పరుగులు జోడించారు. తర్వాత పూరన్(56) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.చివరిలో పంత్(16) పరుగులు చేసి గుజరాత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
236 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ పోరాడి ఓడింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(21), శుభ్మన్ గిల్(35), జోస్ బట్లర్(33), రూథర్ పర్డ్(38), షారుఖ్ ఖాన్(57) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ఓరూక్ 3 వికెట్ల పడగొట్టగా.. బదోనీ, ఆవేష్ చెరో రెండు వికెట్లు, అహ్మద్, ఆకాశ్ తలో వికెట్ తీశారు.