Prime9

PBKS Vs MI Updates: పంజాబ్, ముంబై మధ్య రసవత్తర పోరు.. గెలుపెవరదో..?

PBKS Vs MI Updates: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. జైపూర్ వేదికగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరుకున్న ఈ రెండు జట్లు.. టాప్-2 స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే 13 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు 8 విజయాలు సాధించి ఓ మ్యాచ్ రద్దు కావడంతో 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై జట్టు 13 మ్యాచ్ లు ఆడి 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టుకు టాప్-2 లో బెర్త్ ఖారారవుతుంది. దీంతో ఇరుజట్లు మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.

 

ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలుస్తుంది. అలాగే పంజాబ్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో బెంగళూరు తన చివరి మ్యాచ్ లో గెలిచినా.. టాప్ లో కొనసాగనుంది. మరోవైపు నేటి మ్యాచ్ లో ముంబై గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలుస్తుంది. ఒకవేళ లక్నో చేతిలో బెంగళూరు ఓడిపోతే ముంబై టాప్ లోకి వెళ్తుంది. మొత్తానికి నేటి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

 

Exit mobile version
Skip to toolbar