Prime9

IPL 2025: బెంగళూరు, కోల్ కతా మ్యాచ్ కు వర్షం అడ్డంకి.. 5 ఓవర్లైనా ఆడతారా?

RCB Vs KKR: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే టాస్ వేసే సమయానికి వర్షం పడటంతో టాస్ ఆలస్యంగా కానుంది. ఇప్పటికే 7 గంటలకు వేయాల్సిన టాస్ ఇంకా వేయలేదు. దీంతో మ్యాచ్ కి వచ్చిన ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.

 

కాగా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ ను రీషెడ్యూల్ చేశారు. గత వారం మ్యాచ్ లను రద్దు చేసి.. తిరిగి నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. అయితే బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్ కు క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. వర్షం పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే వర్షం తగ్గగానే మ్యాచ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం ఇలాగే కొనసాగితే ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

అయితే చిన్నస్వామి స్డేడియంలో అధునాతన డ్రైనేజ్ వ్యవస్థ ఉండటంతో మ్యాచ్ నిర్వహించేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కోల్ కతాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ ఓడినా, ఫలితం తేలకపోయినా నాకౌట్ రేసు నుంచి వైదొలగాల్సిందే.

Exit mobile version
Skip to toolbar