Bengaluru flood: విప్రో, ప్రెస్టీజ్, కొలంబియా హాస్పిటల్.. బెంగళూరు డ్రెయిన్ల ఆక్రమణదారులు

బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) సుమారు 700 వర్షపు నీటి కాలువల పై వివిఐపి ఆక్రమణదారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెక్ పార్కులు, హై ప్రొఫైల్ బిల్డర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు డెవలపర్లు ఉన్నారు.

  • Written By:
  • Updated On - September 14, 2022 / 02:53 PM IST

Bengaluru: బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) సుమారు 700 వర్షపు నీటి కాలువల పై వివిఐపి ఆక్రమణదారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెక్ పార్కులు, హై ప్రొఫైల్ బిల్డర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు డెవలపర్లు ఉన్నారు. ఈ జాబితాలో విప్రో, ఎకో స్పేస్, ప్రెస్టీజ్, కొలంబియా ఏషియా హాస్పిటల్, బాగ్‌మనే టెక్ పార్క్ మరియు దివ్యశ్రీ విల్లాస్ వంటి హై-ప్రొఫైల్ పేర్లు ఉన్నాయి.

సాధారణ ప్రజలు, వ్యాపారాలు లేదా టెక్ కంపెనీలకు చెందినవి అనే తేడా లేకుండా, తొలగింపు నోటీసులు జారీ చేసాము. రాబోయే వారాల్లో అన్ని అక్రమ నిర్మాణాలను క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. మురికినీటి కాలువలను ఆక్రమించి భవనాలను నిర్మించడంతో వరదకు గురైన 696 ప్రాంతాలను నగరంలో బిబిఎంపి గుర్తించింది. వీటిలో అత్యధికంగా ఆక్రమణలు (175) మహదేవపురలోనే ఉన్నాయి.

మహాదేవపురలోని నివాస అపార్ట్‌మెంట్ భవనాన్ని కూల్చివేయడం అధికారుల ముందున్న సవాళ్లలో ఒకటి. మహావీర్ రీగల్ అపార్ట్‌మెంట్‌లోని ఇంటి యజమానులకు తొలగింపు నోటీసులు పంపామని, అయితే ఇంకా స్పందన లేదని అధికారులు తెలిపారు.