Ram Temple opening: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం.. ఈ నెల 22న యూపీలో విద్యాసంస్దలకు సెలవు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలకు జనవరి 22 న సెలవు ప్రకటించారు.విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 08:27 PM IST

Ram Temple opening: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలకు జనవరి 22 న సెలవు ప్రకటించారు.విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు. జనవరి 22న అన్ని ప్రభుత్వ భవనాలను అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.

పరిశుభ్రంగా ఉంచాలి..(Ram Temple opening)

రామమందిరం వేడుకల సన్నాహాలను సమీక్షించడానికి అయోధ్యకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అయోధ్యలో పరిశుభ్రత కోసం’కుంభ్ మోడల్’ని అమలు చేయాలని ఆదేశించారు.జనవరి 14న అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు, పవిత్రోత్సవాల సన్నాహక సమయంలో నగరాన్ని పరిశుభ్రంగా నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు.వివిఐపిల విశ్రాంతి స్థలాలను ముందుగానే నిర్ణయించాలని, వేడుక సజావుగా మరియు వ్యవస్థీకృతంగా జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు.

జనవరి 22 న అయోధ్య ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగుతోంది. మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్త్ , పలువురు రాజకీయ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమమానికి హాజరవుతున్నారు.