cheetah cubs Die: కునో నేషనల్ పార్క్ లో మరో రెండు చిరుత పిల్లలు మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మొదటి పిల్ల మరణించిన కొన్ని రోజుల తర్వాత, జ్వాల మరో రెండు చిరుత పిల్లలు గురువారం మరణించాయి. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.కొత్తగా పుట్టిన మూడు చిరుతలు చనిపోగా, నాల్గవది అతని ఆరోగ్యం విషమంగా ఉన్నందున పరిశీలనలో ఉంచబడింది.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 06:37 PM IST

cheetah cubs Die:మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మొదటి పిల్ల మరణించిన కొన్ని రోజుల తర్వాత, జ్వాల మరో రెండు చిరుత పిల్లలు గురువారం మరణించాయి. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.కొత్తగా పుట్టిన మూడు చిరుతలు చనిపోగా, నాల్గవది అతని ఆరోగ్యం విషమంగా ఉన్నందున పరిశీలనలో ఉంచబడింది.

ఆరుకు చేరిన మరణాల సంఖ్య.. (cheetah cubs Die)

2022 సెప్టెంబర్‌లో నమీబియా నుండి వచ్చిన కునో నేషనల్ పార్క్ వచ్చిన చిరుత జ్వాల ఈ ఏడాది మార్చి చివరి వారంలో ఆమె నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు కేఎన్‌పీకి వచ్చాయి. నమీబియా చిరుతల్లో ఒకటైన సాషా కిడ్నీ సంబంధిత వ్యాధితో మార్చి 27న మరణించగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఉదయ్ అనే మరో చిరుత ఏప్రిల్ 13న మరణించింది.దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన దక్ష అనే చిరుత, మే 9 మరో చిరుతతో ఘర్షణ కారణంగా గాయాలతో మరణించింది.తల్లి చిరుత ఆరోగ్యంగా ఉందని, పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. తాజా మరణాలతో కునోలో గత రెండు నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో ఒక్క పిల్ల మాత్రమే మిగిలి ఉంది.

మొదటి పిల్ల బలహీనతతో చనిపోయిందని అటవీ శాఖ అధికారి తెలిపారు.అన్ని చిరుత పిల్లలూ బలహీనంగా, తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. మొదటి సారి డెలివరీ అయిన జ్వాల హుంద్ రియాద్ జాతికి చెందినది. పిల్లలు, దాదాపు ఎనిమిది వారాల వయస్సులో ఉన్నప్పుడు, తమ తల్లి చుట్టూ గుమికూడి ఉండాలని కోరుకుంటాయి. అవి 8-10 రోజుల క్రితం తమ తల్లితో కలిసి నడవడం ప్రారంభించాయని రెండు పిల్లల మరణం తర్వాత కునో నేషనల్ పార్క్ తెలిపింది.కునో నేషనల్ పార్క్ లో మూడు చిరుతల మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మే 18 న సుప్రీంకోర్టు చిరుతలను రాజస్థాన్‌కు తరలించే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.