Site icon Prime9

Digvijay Singh: పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు లేవు.. దిగ్విజయ్ సింగ్

Digvijay Singh

Digvijay Singh

Digvijay Singh: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ 2019 పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు చంపడంపై ప్రశ్నలు  సంధించారు.

పాకిస్తాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను భారతీయ జనతా పార్టీ డ్రామాగా అభివర్ణించారు .

ఈ వాదనలను ప్రామాణీకరించడానికి  ఏ రుజువు లేదని అన్నారు.

సెప్టెంబరు 2016న న్యూఢిల్లీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మిలిటెంట్ లాంచ్ ప్యాడ్‌లపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి, ణనీయమైన ప్రాణనష్టం జరిగినట్ప్రలు కటించింది.

సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలు లేవు.. దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh)

జమ్మూ కాశ్మీర్‌లో  సోమవారం జరిగిన ఒక బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ వారు (కేంద్రం) సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడతారు.

వారు చాలా మందిని చంపామంటారు.కానీ ఎటువంటి రుజువు లేదు.కేంద్రం అబద్ధాల సహాయంతో పాలన సాగిస్తోంది.

ఈ దేశం మనందరిదని నేను మీకు చెప్పాలనుకుంటున్నానని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

సీఆర్పీఎఫ్ పై దాడి చేసిన వాహనాన్ని సరిగ్గా తనిఖీ చేసి ఉంటే 2019 ఉగ్రవాద దాడిని నివారించవచ్చని పేర్కొన్నారు.

వారు ఎందుకు చనిపోయారు? సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ శ్రీనగర్ నుండి ఢిల్లీకి సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఎయిర్‌లిఫ్టింగ్ కోసం ప్రయత్నించారు,

ఈ ప్రాంతం సున్నితమైనది, కానీ ప్రధాని మోదీ అభ్యర్థనను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు?” అని సింగ్ ప్రశ్నించారు.

పార్లమెంటులో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు..

పుల్వామా ఉగ్రవాద కేంద్రంగా మారిందని ఆరోపిస్తూ.. ఆ ప్రాంతంలో ప్రతి కారును తనిఖీ చేస్తారు.

మరి  ఆ రోజు స్కార్పియో కారును ఎందుకు తనిఖీ చేయలేదు? వాహనం తప్పుడు దిశలో వస్తుంది.. ఎందుకు తనిఖీ చేయలేదు? వెంటనే అది సీఆర్పీఎఫ్ వ్యాన్‌ను ఢీకొట్టింది.

సీఆర్పీఎఫ్ లో 40 మంది మరణించారు. ఇప్పటి వరకు, ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం పార్లమెంటులో ఇవ్వబడలేదు. ప్రజలకు దాని గురించి తెలియదని సింగ్ అన్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అదనపు ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా కమల్ఉరీ మరియు పుల్వామా దాడి వెనుక మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిన దాదాపు వారం తర్వాత దిగ్విజయ్ ఈ ప్రశ్నలడగడం విశేషం.

ఈ రెండు దాడులూ కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో జరిగాయని కమల్ ఆరోపించారు. ఈ దాడుల తర్వాత సైనికుల మృతదేహాలు లేదా చిత్రాలు ఏవీ లభించలేదని ముస్తఫా ఆరోపించారు.

14 ఫిబ్రవరి 2019న ఏం జరిగింది?..

పుల్వామా దాడి తరువాత విలేకరుల సమావేశంలో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కనీసం 70 వాహనాల్లో 2,500 మంది సైనికులు తిరిగి వస్తున్నారని తెలిపారు.

చాలా మంది సైనికులు లోయలో తిరిగి విధుల్లో చేరడానికి సెలవు నుండి తిరిగి వస్తున్నారు.

అయితే, జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ నడుపుతున్న వాహనం కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుంది.

ఆత్మాహుతి దాడిలో 80 కిలోల హైగ్రేడ్ ఆర్‌డిఎక్స్ పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాంగ్రెస్‌కు దేశభక్తి లేదు..

మరోవైపు సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ కాంగ్రెస్‌కు దేశభక్తి లేదని అన్నారు.

బాధ్యతా రహితంగా ప్రకటనలు చేయడం కాంగ్రెస్ పార్టీ లక్షణం.

మన భద్రతా బలగాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేశం సహించదు.

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లకు ఉన్న ద్వేషం వల్ల వారిలో ఇప్పుడు దేశభక్తి లేదని గౌరవ్ భాటియా అన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar