Site icon Prime9

Union Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్‌.. వరికి మద్దతు ధర పెంచిన కేంద్రం

Union Cabinet

Union Cabinet

Good news for Farmers Union Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతన్నలకు సర్కారు వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50 శాతం పెంచింది. కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 11 ఏళ్లలో ఖరీప్‌ పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెరిగిందని చెప్పారు. 2025-26కి వానకాలం మార్కెటింగ్ సీజన్‌కు ఎమ్మెస్పీ పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది.

 

2025-26 ఖరీఫ్ సీజన్‌కు వరి క్వింటాలుకు రూ.69 మద్దతు పెంచింది. తాజాగా పెంపుతో రూ.2,369 పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కేటాయించినట్లు పేర్కొన్నారు. జొన్నలు క్వింటాల్‌కు రూ.328, సజ్జలు క్వింటాల్‌కు రూ.150, రాగులు క్వింటాల్‌ రూ.596, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.175 పెంచినట్లు పేర్కొన్నారు. కందిపప్పు క్వింటాల్‌కు రూ.450, పెసర్లు క్వింటాల్‌కు రూ.86, మినుములు క్వింటాల్‌ రూ.400, వేరుశెనగ క్వింటాల్‌ రూ.480 పెంచినట్లు వివరించారు.

 

పొద్దుతిరుగు క్వింటాల్ రూ.441, సోయాబీన్ క్వింటాల్ రూ.436, కుసుములు క్వింటాల్ రూ.579, వలిసెలు క్వింటాల్‌కు రూ.820, పత్తి క్వింటాల్‌కు రూ.589 పెంపు, నువ్వులు క్వింటాల్‌కు రూ.579 పెంచినట్లు చెప్పారు. ఏపీ-కృష్ణపట్నం ఓడరేవుకు, హెచ్‌హెచ్‌ 67లోని ఓ భాగానికి ఓడరేవు కనెక్టివిటీ, ఏపీలోని మూడు పారిశ్రామిక కారిడార్ల కలుపనున్నది. సుమారు 108 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం జరుగనుంది.

 

Exit mobile version
Skip to toolbar