Site icon Prime9

Pahalgam : పహల్గాం ఉగ్రదాడి ప్రదేశంలో కలకలం.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో అనుమానాస్పద వ్యక్తి..!

Pahalgam

Pahalgam

Pahalgam : పహల్గాం ఉగ్రదాడి యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు కూడా దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించగా, ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్మూకశ్మీర్‌‌లో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కలకలం చెలరేగింది.

 

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన వ్యక్తి..
ఉగ్రదాడి జరిగిన బైసరన్‌ లోయ సమీపంలో ఓ వ్యక్తి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం అతడిని విచారించారు. ఈ సందర్భంగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్‌ ఎక్కడి నుంచి వచ్చిందని అడగగా, సమాధానం కూడా చెప్పలేదు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. పహల్గాంలోని బైసరన్‌ లోయలో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

 

ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. దాడికి పాల్పడింది తామేనని ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ప్రకటించింది. ఇది పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ. అందుకే దీన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించుకోవడం భారత్‌కు పాక్‌పై ఆగ్రహం తెప్పించింది. పాక్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధించింది. దాంతో రెండు దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.

Exit mobile version
Skip to toolbar