Site icon Prime9

PM Modi : దేశంలో శాంతి కోసం నక్సలిజాన్ని నిర్మూలిస్తాం : ఛతీస్‌గఢ్ ఎక్‌కౌంటర్‌పై మోదీ పోస్ట్

PM Modi

PM Modi

Prime Minister Narendra Modi : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నానని కొనియాడారు. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును మోదీ రీపోస్టు చేశారు.

 

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు(70) అలియాస్ బసవరాజు మృతిచెందినట్లు ఎక్స్ వేదికగా అమిత్ షా వెల్లడించారు. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి విజయమని కొనియాడారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని రాసుకొచ్చారు. మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట పర్వతాల్లో 24 రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar