Site icon Prime9

PM Modi: మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పను.. మోదీ కీలక వ్యాఖ్యలు

PM Narender Modi Statements in Bihar

PM Narender Modi Statements in Bihar

PM Narender Modi Statements in Bihar: మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్‌లో రెండో రోజూ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కరకట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ కామెంట్స్ చేశారు. ఉగ్రవాది దాడి విషయంలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నామన్నారు. పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా స్థావరాలను ధ్వంసం చేశామన్నారు.

 

ఉగ్రవాదంపై మన పోరాటం ఇంకా ఆగలేదని మోదీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నిందితులను మట్టుబెడతామని ఇదే గడ్డపై మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకున్నాకే ఈ గడ్డ మీద అడుగుపెట్టానన్నారు. దేశం లోపలైన, వెలుపలైనా శత్రువులను వదిలే ప్రసక్తే లేదన్నారు. పాక్ సైనిక స్థావరాలను కొన్ని నిమిషాల్లోనే నాశనం చేశామన్నారు. ఇది నవభారతం.. ఇది నవభారత శక్తి అని మోదీ అన్నారు.

Exit mobile version
Skip to toolbar