Helicopter crash in Kedarnath Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ దగ్గర ఓ హెలికాప్టర్ ల్యాండింగ్కు ముందు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు భయాందోళనకు గురయ్యారు.
వివరాల ప్రకారం.. కేదార్నాథ్ దర్శించుకునేందుకు భక్తులు హెలికాప్టర్లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ హెలికాప్టర్ ల్యాండింగ్కు ముందే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తోక భాగం పూర్తిగా విరిగిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కాగా, కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను కలిపి చార్ ధామ్ యాత్రగా పిలుస్తారు. ఈ యాత్రలో భాగంగా తొలుత గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా తెరిచారు. ఇందులో భాగంగా నిత్యం భక్తులు సందర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ సమయంలోనే ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్తో పాటు ఇద్దరు డాక్టర్లు, మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. రిషికేష్ ఎయిమ్స్కు చెందిన ఈ హెలికాప్టర్ ఓ పేషెంట్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో సడెన్గా టెక్నికల్ లోపం కారణంగా క్రాష్ అయినట్లు వెల్లడించారు.
సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే హుటాహుటినీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ గవర్న్ మెంట్కు చెందినదిగా సమాచారం.
अभी-अभी आई केदारनाथ धाम से एक खबर यहां एक हेलीकॉप्टर ठीक केदारनाथ धाम हेलीपैड से पहले ही एक्सीडेंट हो गया है
बाबा केदारनाथ जी की कृपा से सभी सुरक्षित निकल लिए गए हैं#Kedarnath #Uttarakhand pic.twitter.com/MuOryoJmXB
— Pyara Uttarakhand प्यारा उत्तराखंड (@PyaraUKofficial) May 17, 2025