Site icon Prime9

లాలూ ప్రసాద్ యాదవ్: IRCTC స్కామ్ .. లాలూ ప్రసాద్ యాదవ్ పై విచారణ ప్రారంభించిన సీబీఐ

Lalu

Lalu

Lalu Prasad Yadav: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభకోణంలో రాష్ట్రీయ జనతా దళ్మాజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం తిరిగి విచారణ ప్రారంభించింది. 2017లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ మరియు ఇతరులపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ బీహార్ డిప్యూటీ సీఎంకు సెప్టెంబర్ 28న నోటీసు జారీ చేశారు. లాలూ, అతని కుటుంబ సభ్యులు మరియు ఐఆర్ సీటీసీ అధికారులు రెండు ఐఆర్ సీటీసీ హోటళ్లకు కాంట్రాక్ట్‌లను మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

పూరీ, రాంచీల్లోని ఈ హోటళ్ల కాంట్రాక్టును ఒక ప్రైవేట్ సంస్థకు మంజూరు చేయడంలో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో నిందితుడైన బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరారు. తేజస్వియాదవ్ కోర్టు ముందు హాజరైన తరువాత 2018 అక్టోబర్‌లో అతనికి బెయిల్ మంజూరు అయింది.

Exit mobile version
Skip to toolbar