Heavy rain in Delhi: ఢిల్లీలో వర్షం దంచికొట్టింది. ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రహదారులు వరద నీటితో నిండిపోయాయి. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 100కు పైగా ఫైట్లు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 25కి పైగా దారి మళ్లించారు.
ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం అడ్వైజరీ జారీచేసింది. ప్రతికూల వాతారణంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని తెలిపింది. సర్వీసులను పునరుద్ధరించలేదని పేర్కొంది. ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. సఫ్దర్జంగ్లో 81 మిల్లీ మీటర్లు, పాలం ప్రాంతంలో 68 మిల్లి మీటర్లు నమోదు కాగా, పూసా 71 మిల్లి మీటర్లు, మయూర్ విహార్లో 48 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వానతో మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఓ కారు మునిగిపోయింది.