Site icon Prime9

ED: ముంబై అధికారి ఇంట్లో ఈడీ రైడ్స్.. భారీగా డబ్బు, బంగారం సీజ్

ed

ed

Raids: ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అవినీతి అధికారి చిక్కాడు. ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు అక్కడ బయటపడిన బంగారం, డబ్బు చూసి నోరెళ్ల బెట్టారు. అసలు ఆ అధికారికి ఇంత నగదు, బంగారం ఎలా వచ్చాయనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ విచారణ చేసతోంది.

 

హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. బిల్డర్స్ తో కుమ్మక్కై 41 భవనాలకు అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు వైఎస్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్, ముంబైలోని ఆయన నివాసాల్లో, 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపింది.

 

సోదాల్లో 9 కోట్ల రూపాయలకు పైగా నగదు, 23 కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. నోట్ల కట్టలు, నగలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. కోట్ల విలువైన డాక్యుమెంట్లను కూడా అధికారులు గుర్తించినట్టు తెలిసింది.

 

 

Exit mobile version
Skip to toolbar