ఒమిక్రాన్: భారత్ మళ్లీ ఒమిక్రాన్ కేసులు పెరగనున్నాయా.. చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఇదే..!

ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమయిన ఒమిక్రాన్ వేరియంట్ BF.7 భారత్ లో ప్రవేశించింది.

  • Written By:
  • Publish Date - December 22, 2022 / 09:46 AM IST

Omicron: ప్రస్తుతం చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదలకు కారణమయిన ఒమిక్రాన్ వేరియంట్ BF.7 భారత్ లో ప్రవేశించింది. భారతదేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు కనుగొనబడినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. భారతదేశంలో మొదటి BF.7 కేసును అక్టోబర్‌లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. ఇప్పటివరకు గుజరాత్‌లో రెండు కేసులు నమోదవగా, ఒడిశాలో ఒక కేసు నమోదైందని వారు తెలిపారు.

బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన కోవిడ్ సమీక్షా సమావేశంలో నిపుణులు మాట్లాడుతూ, ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేనప్పటికీ, ఇప్పటికే ఉన్న మరియు అభివృద్ధి చెందుతున్న వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి నిరంతర నిఘా అవసరమన్నారు. చైనీస్ నగరాలు ప్రస్తుతం అత్యధికంగా వ్యాపించే ఓమిక్రాన్ జాతికి గురవుతున్నాయి, ఎక్కువగా BF.7 బీజింగ్‌లో వ్యాప్తి చెందుతున్న ప్రధాన రూపాంతరం. ఇది కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల విస్తృత పెరుగుదలకు దోహదపడుతోంది.చైనాలో BF.7 యొక్క అధిక వ్యాప్తికి జనాభాలో తక్కువ స్థాయి రోగనిరోధక శక్తి మరియు టీకాలు ఎక్కువగా వేయకపోవడం కూడ కారణమని అధికారులు చెబుతున్నారు.