Assam Government issued Arms Licenses to Local People: అస్సాం సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజలకు ఆయుధాల లైసెన్సులు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన జారీ చేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక, ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గౌహతిలోని లోక్ సేవా భవన్లో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడారు. నాగావ్లోని ఢింగ్, రూపోహి, దక్షిణ సల్మారా, గౌహతిలోని హాటిగావ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో లైసెన్సులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాంతాలను సర్కారే గుర్తిస్తుందని చెప్పారు. దరఖాస్తుదారులు నేర చరిత్ర లేకుండా ఉండాలని షరతులు విధించారు. అస్సాం అల్లర్లు (1971-85) మధ్య నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ప్రజల డిమాండ్ నెరవేర్చడమే కాక, వారి భూములను కాపాడుకోవడానికి దోహదపడుతుందన్నారు. జాతి సంస్కృతిని రక్షించుకోవడానికి కూడా నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు.