Prime9

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్

8 People Dead in Bihar Road Accident: బీహార్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కటిహార్ జిల్లాలోని పోతియా సమీపంలో జరిగింది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుపాల్ ప్రాంతానికి చెందిన కొంతమంది పెళ్లి వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జాతీయ రహదారి 31పై పోతియా సమీపంలోని సమేలి బ్లాక్ ఆఫీసు వద్ద ఎదురుగా ట్రక్కు వచ్చింది. ఈ సమయంలో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఎనిమిది మంది చనిపోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.

 

స్థానికులు వెంటనే సమాచారం అందించగా.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. క్షతగాత్రులను స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

 

ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కతిహార్ ఎస్పీ వైభవ్ శర్మ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar