Site icon Prime9

Railways: రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

Railways

Railways

Railways: లక్షలాది మంది భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్రం బుధవారం దీపావళి బహుమతిగా 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన ఉత్పాదకత లింక్డ్ బోనస్ చెల్లింపునకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అర్హత ఉన్న రైల్వే ఉద్యోగికి 78 రోజులకు చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ.17,951 గా నిర్ణయించారు.

ట్రాక్ మెయింటెయినర్లు, డ్రైవర్లు మరియు గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, కంట్రోలర్లు, పాయింట్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బంది మరియు ఇతర గ్రూప్ ‘సి’ సిబ్బందితో సహా వివిధ వర్గాలకు పై మొత్తం చెల్లించబడుతుంది. ఈ బోనస్ చెల్లింపు ప్రోత్సాహకంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. బోనస్ వల్ల ప్రభుత్వం పై పడే భారం రూ.1,832.09 కోట్లుగా అంచనా వేయబడింది.

కోవిడ్ అనంతర సవాళ్ల కారణంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితి ఏర్పడినప్పటికీ బోనస్ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.నిర్వచించిన ఫార్ములాల ఆధారంగా పనిచేసిన రోజుల కంటేచెల్లించే మొత్తం ఎక్కువ అని పేర్కొంది.రైల్వే పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేసేందుకు రైల్వే ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఇది ప్రోత్సాహకంగా పనిచేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Exit mobile version
Skip to toolbar