Prime9

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి.. అగ్రనేత హతం!

20 Maoists Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యరు. ఈ మేరకు 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.

 

నారాయణపూర్‌లోని మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టింది. ఇందులో  28 మంది ఉగ్రవాదులు చనిపోగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హతమైనట్లు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar