Manipur clashes: మణిపూర్‌ ఘర్షణల్లో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం

ణిపూర్‌ ఘర్షణల్లో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి కూడా ఉద్యోగం కల్పిస్తామన్నారు.

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 12:59 PM IST

Manipur clashes:మణిపూర్‌ ఘర్షణల్లో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి కూడా ఉద్యోగం కల్పిస్తామన్నారు. పరిహారం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం సమానంగా భరిస్తాయని అధికారులు తెలిపారు.సోమవారం అర్థరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గింపు..(Manipur clashes)

రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికిపుకార్లను తొలగించడానికి ప్రత్యేక టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.పెట్రోల్, ఎల్‌పిజి గ్యాస్, బియ్యం మరియు ఇతర ఆహార ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించడానికి పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని సమావేశం నిర్ణయించింది. సోమవారం రాత్రి ఇంఫాల్‌కు వెళ్లిన వారిలో హోం మంత్రి అమిత్ షా తో పాటు హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ దేకా ఉన్నారు.

అమిత్ షా మైతీ మరియు కుకి రెండు వర్గాలకు చెందిన రాజకీయ మరియు పౌర సమాజ నాయకులతో వరుస సమావేశాలను నిర్వహిస్తారు. మంగళవారం అల్లర్లు జరిగిన చురచంద్‌పూర్‌ను సందర్శిస్తారు.షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌ను నిరసిస్తూ మే 3న కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగాయి. తాజా ఘర్షణలతో ఆదివారం కనీసం 5 మంది మరణించారు. రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇతర పారామిలిటరీ బలగాలతో పాటు 10,000 మంది సిబ్బందితో కూడిన భారత సైన్యం మరియు అస్సాం రైఫిల్స్‌కు చెందిన 140 కాలమ్‌లు మోహరించాల్సి వచ్చింది.