Jammu-Srinagar highway Accident: జమ్మూ-శ్రీనగర్ హైవేపై బస్సు లోయలో పడటంతో 10 మంది మృతి, 55 మందికి గాయాలు

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి సమీపంలో మంగళవారం బస్సు లోయలో పడి పది మంది మృతి చెందగా, 55 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 75 మంది ప్రయాణికులతో బస్సు అమృత్‌సర్‌ నుంచి కత్రాకు వెడుతోంది.

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 12:07 PM IST

Jammu-Srinagar highway Accident: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి సమీపంలో మంగళవారం బస్సు లోయలో పడి పది మంది మృతి చెందగా, 55 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 75 మంది ప్రయాణికులతో బస్సు అమృత్‌సర్‌ నుంచి కత్రాకు వెడుతోంది.బస్సులో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్తున్నారని జమ్మూ ఎస్‌ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు. మరణించిన పది మంది బీహార్‌కు చెందిన వారని తెలిపారు.

వైష్ణోదేవి యాత్రకు ..(Jammu-Srinagar highway Accident)

ఈ ఘటనలో 10 మంది మరణించగా 55 మంది గాయపడ్డారు. అందరినీ ఖాళీ చేయించారు. రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఉంది.తీవ్రంగా గాయపడిన నలుగురిని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రికి తరలించామని, మరో 12 మంది జమ్మూలోని స్థానిక పిహెచ్‌సిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.బస్సు మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రికులను తీసుకువెళుతున్నట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రయాణికులు బీహార్‌లోని లఖిసరాయ్‌కు చెందినవారు. వారి పిల్లల మతపరమైన కార్యక్రమం కోసం మాతా వైష్ణో దేవికి తీర్థయాత్రకు వెడుతున్నారు. అంతకుముందు మే 21 న, జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో మాతా వైష్ణో దేవి యాత్రికులతో రాజస్థాన్ వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో 27 ఏళ్ల మహిళ మరణించింది. 24 మంది గాయపడ్డారు.