Site icon Prime9

Zomato: రూ.287 పిజ్జా ఆర్డర్‌ రద్దు.. జొమాటోకు రూ. 10,000 ఫైన్

Zomato: పిజ్జా ఆర్డర్‌ను రద్దు చేసిన కస్టమర్‌కు రూ. 10,000 చెల్లించాలని వినియోగదారుల ఫోరం జొమాటోను ఆదేశించింది. ఆ కస్టమర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌పై ఫిర్యాదు చేశాడు. సమయానికి ఆహారం ఇవ్వబడుతుందున్న వారి ప్రచారాన్ని ఉల్లంఘించారంటూ కస్టమర్ చేసిన ఫిర్యాదుకు ఫోరం స్పందించింది.

అజయ్ శర్మ అనే కస్టమర్ 2020లో జొమాటో యాప్‌ని ఉపయోగించి పిజ్జా ఆర్డర్‌ను చేసాడు. అతను తన ఆర్డర్ కోసం పేటీఎం ద్వారా రూ. 287 చెల్లించాడు, అది రాత్రి 10.15 గంటల సమయంలో జరిగింది. ఈ మొత్తంలో పన్నులు మరియు ఆన్-టైమ్ డెలివరీ కోసం రూ. 10 కలిపి ఉన్నాయి. అయితే రాత్రి 10.30 గంటలకు శర్మ తన ఆర్డర్ రద్దు చేయబడిందని మరియు రిఫండ్ ప్రారంభించబడిందని మెసేజ్ అందుకున్నాడు. వస్తువును డెలివరీ చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారు బుకింగ్ చేయకూడదు. వారు బుకింగ్ చేసి తర్వాత రద్దు చేసుకున్నారు. అందువల్ల, వారు సేవలను అందించడంలో విఫలమయ్యారని శర్మ అన్నారు. రూ. 10 అదనంగా వసూలు చేసినప్పుడు, వారు అదే సమయానికి డెలివరీ చేస్తారని భావిస్తారని ఆయన అన్నారు. దీనివలన తాను ఇబ్బందిపడ్డానని అన్నారు.

పరిహారం ఇవ్వాలని కోరుతూ శర్మ న్యూఢిల్లీలోని వినియోగదారుల రక్షణ అథారిటీ చీఫ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే అతని ఫిర్యాదు కొట్టివేయబడింది. తరువాత అతను చండీగఢ్ వినియోగదారుల కమిషన్ ముందు పిటిషన్ దాఖలు చేశాడు.కభీ టు లేట్ హో జాతా” అనే ప్రచార నినాదాన్ని ఉపసంహరించుకోవాలని కూడా ఆయన జొమాటోను కోరారు.చండీగఢ్ స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ జోమాటోను శర్మకు రూ. 10,000 అందించాలని మరియు “సేవను అందించడంలో లోపం కారణంగా శర్మకు ఉచిత భోజనాన్ని అందించాలని ఆదేశించింది.

Exit mobile version
Skip to toolbar