Demand for donkey milk and meat in AP: ఏపీలో గాడిద పాలు, మాంసానికి డిమాండ్.. ఔషధ విలువల పేరుతో గాడిదలను చంపేస్తున్నారన్న ’పెటా‘

జంతు హక్కుల స్వచ్ఛంద సంస్థ పెటా (పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌) సంయుక్త ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి దాదాపు 750 కిలోల గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు .

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 05:43 PM IST

PETA India: జంతు హక్కుల స్వచ్ఛంద సంస్థ పెటా (పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌) సంయుక్త ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి దాదాపు 750 కిలోల గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు . 36 గాడిదలను పోలీసులు రక్షించారు. గాడిద పాలు, మాంసం, రక్తంలో ఔషధ విలువలు ఉంటాయన్న గుడ్డి విశ్వాసం కారణంగా ఈ ప్రాంతంలో గాడిదలను అక్రమంగా వధిస్తున్నారు.

పెటా ప్రతినిధి గోపాల్ సురబత్తుల న్యూస్ 1 మాట్లాడుతూ గాడిద పాలు, మాంసం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే వరకు పరిగెత్తితే ఉక్కులాంటి శరీరాన్ని నిర్మించుకోవచ్చని మూఢనమ్మకం ఈ ప్రాంతంలో ఉందని అన్నారు.ఈ మూఢనమ్మకాల వల్ల గాడిద మాంసానికి డిమాండ్ పెరిగింది. కొంత మంది స్వార్థంతో గాడిద మాంసాన్ని కిలో రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు.గాడిద మాంసాన్ని విక్రయించడం, గాడిదలను అక్రమంగా రవాణా చేయడం నేరం అయినప్పటికీ కొందరు ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా గాడిదలను దిగుమతి చేసుకుంటున్నారు.లీటరు రూ.10 వేలకు అమ్ముతున్న గాడిద పాలతో ఉబ్బసం రోగులు నయమవుతారనే అపోహ కూడా ఉందని సురబత్తుల తెలిపారు. గాడిద రక్తం, పాలు, మాంసంలో ఔషధ విలువలు లేవని శాస్త్రీయంగా రుజువైందని ఆయన స్పష్టం చేశారు.

గత ఒక దశాబ్దకాలంలో గాడిద జనాభా తగ్గిందని ఇటీవలి గణాంకాలు సూచిస్తున్నాయని ఆయన చెప్పారు. ఔషధ విలువల పేరుతో గాడిదలను చంపేసే చర్యలకు స్వస్తి పలకాలని పెటా అధికారులను కోరింది.