Site icon Prime9

Charlapalli: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక స్టేషన్ నుంచి బస్సులు

tgsrtc

tgsrtc

TGSRTC: రాష్ట్రంలోని పెద్ద రైల్వేస్టేషన్ ఒకటి. రోజు వందల కొద్ది రైళ్లు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి జరగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే స్టేషన్లో ఉన్న 10 ప్లాట్ ఫాంలు రైళ్ల రాకపోకలకు సరిపోవడం లేదు. దీంతో రైళ్లను గంటల తరబడి సిటీ శివార్లలో ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ పై భారీగా ఒత్తిడి పడింది. ఈ ఒత్తిడి తగ్గించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి టర్మినల్ స్టేషన్ ను అభివృద్ధి చేసింది. ఎయిర్ పోర్ట్ తరహాలో నిర్మాణం చేపట్టింది. అలాగే సికింద్రాబాద్ నుంచి బయల్దేరే కొన్ని రైళ్లను చర్లపల్లికి బదిలీ చేసింది.

ఇదంతా బాగానే ఉన్నా.. చర్లపల్లికి వచ్చిన ప్రయాణికులు తిరిగి నగరంలోకి వచ్చేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. స్టేషన్ నుంచి సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో సొంత వాహనాలు, ప్రైవేట్ క్యాబ్ లు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక రాత్రి సమయాల్లో ప్రయాణాలు కొనసాగించేవారు వాహనదారులకు భారీగా డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో రైల్వే అధికారులకు ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. చర్లపల్లి నుంచి సిటీకి చేరుకునేందుకుగాను ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట చర్లపల్లి నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు 10 నిమిషాలకు ఒక బస్సును నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సులు ఉదయం 4.20 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 139 బస్సులను నడిపిస్తున్నామని, త్వరలోనే మరో 120 బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.

చర్లపల్లి- సికింద్రాబాద్ వయా: మల్లాపూర్, హబ్సిగూడ (250సీ)

చర్లపల్లి- సికింద్రాబాద్ వయా: ఈసీఐఎల్ (18హెచ్)

చర్లపల్లి- చార్మినార్ వయా: ఉప్పల్ (71ఏ)

చర్లపల్లి- మెహిదీపట్నం వయా: ఉప్పల్, ఎల్బీ నగర్ (300)

చర్లపల్లి- బోరబండ వయా: ఉప్పల్, రామాంతాపూర్, హిమాయత్ నగర్ (113ఎఫ్)

చర్లపల్లి- పటాన్ చెరువు

Exit mobile version
Skip to toolbar