Prime9

Rain Alert: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Rain Alert to Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం పడొచ్చని తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఈదురుగాలులతో వర్షం పడవచ్చని తెలిపింది.

 

ఏపీలోని అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.

 

ఇక, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

 

ఇదిలా ఉండగా, గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలతో వరి ధాన్యం ఆరకపోవడంతో రైతు వేదికల వద్ద ఇబ్బందికరంగా మారింది. ఆరబెట్టిన ధాన్యం కూడ తడిసిపోతుందని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు. అలాగే కొన్ని చోట్ల ఈదురుగాలుల ప్రభావంతో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో మామిడి కాయలు రాలుతున్నాయిన వాపోతున్నారు.

Exit mobile version
Skip to toolbar