Prime9

Fire Accident In Hyderabad :గల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం కలచివేసింది : పీఎం మోదీ

Fire Accident In Hyderabad : హైదరాబాద్ లోని గల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై ప్రధాని మోది తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చోప్పున పరిహారాన్ని ప్రకటించారు.

ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ లోని పాతబస్తీలో గుల్జార్ హౌజ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో17మంది మృతి చెందారు. మృతుల్లో బెంగాల్ వాసులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో చిన్నారులు ఎనిమిది మంది ఉన్నట్లు అధికారులు వెళ్లడించారు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

 

హైదారాబాద్ లోని గుల్జార్ హౌస్ ప్రమాద స్థలాన్ని ఫైర్ డీజీ నాగిరెడ్డి పరిశీలించారు. ఎక్కువ మంది పొగ వల్ల ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ గురించి ఉదయం 6 గంటలకు సమచారం అందిందన్నారు. బిల్డింగ్ కు చాలా చిన్న ఎంట్రెన్స్ ఉందని తెలిపారు. మంటలను అదుపు చేయడానికి 11 ఫైర్ ఇంజన్లతో పాటు 70 మంది సిబ్బంది పాల్గొన్నారని   ఫైర్ డీజీ నాగిరెడ్డి అన్నారు.

Exit mobile version
Skip to toolbar