4 died due to Heavy Rain in Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రాష్ట్రంలో అత్యధికంగా మెదక్లో 11.2సెం.మీల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మంచిర్యాలలో 9.9, రంగారెడ్డిలో 9, సూర్యాపేటలో 8.9, నిర్మల్లో 8.8, వరంగల్లో 8.5, సిద్ధిపేటలో 8.4, నల్గొండలో 8.2, పెద్దపల్లిలో 8.1, నిజామాబాద్లో 7.9,. హైదరాబాద్లో అత్యధికంగా బండ్లగూడలో 8.8.. అంబర్పేటలో 8.5, సైదాబాద్లో 8.3, మలక్పేటలో 8.2, పరూర్నగర్లో 7.7, ఉప్పల్లో 7.7, ఎల్బీనగర్లో 7 సెం.మీల వర్షం నమోదైంది.
అలాగే, పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, నల్గొండ, బంటు గూడెం ఒకరు మృతి చెందారు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాలోని అప్పాజీ పేట గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురై మహిళా రైతు జాల భిక్షమమ్మ (46) మృతి చెందింది. అలాగే మహబూబాబాద్ జిల్లాలోని గుడెంగలో ప్రవీణ్ కుమార్(27), ఓతాయి గ్రామంలో గొర్రెల కాపరి చేరాలు(55), నాగరాజు(18) మృతి చెందారు.