Site icon Prime9

TGPSC : గ్రూప్‌-1 నియామకాలకు లైన్ క్లియర్.. కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు

TGPSC

TGPSC

TGPSC : తెలంగాణలో గ్రూప్‌-1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా సుప్రీం కోర్టు కేసును కొటివేసింది. దీంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్‌ చేస్తూ గ్రూప్‌-1 అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ సర్కారు జీవో 29ను జారీ చేసింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా పిటిషన్‌ కొట్టివేతతో గ్రూప్‌ 1 నియామకాలకు అడ్డంకి తొలగింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.

Exit mobile version
Skip to toolbar