Ex-Minister KTR Sensational Comments on Congress govt Over Hyderabad Fire Accident: అందాల పోటీలు కాదు.. అగ్ని ప్రమాదాలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూాడాలని సూచించారు. తాను రాజకీయంగా మాట్లాడడానికి రాలేదని, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పారు.
అగ్ని ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం కాకుండా రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోం మంత్రిగా సీఎం రేవంత్ ఉన్నారని, హోం మంత్రిగా ఆయన సంఘటన స్థలానికి వస్తే.. మరింత సహాయక చర్యలు లభించేవన్నారు.
ఎండాకాలానికి ముందే అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమయానికి ఫైర్ ఇంజన్లు వచ్చినా అందులో సరిపడా నీళ్లు లేవని, సిబ్బందికి సరైన మాస్కులు లేవని విమర్శలు చేశారు. ఇక అంబులెన్స్లో ఆక్సిజన్ సింగల్ లేకపోవడం దురదృష్టకరమని, బాధితులకు కనీసం ఆక్సిజన్ కూడా ప్రభుత్వం అందించలేకపోయిందన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని వెల్లడించారు.