Prime9

Ex Minister Harish Rao: హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. మృతులకు రూ. 25 లక్షలు ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్

Ex Minister Harish Rao demand for government fire accident Ex gratia: హైదరాబాద్​లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అగ్ని ప్రమాదంలో ఉదయం ఊపిరాడకుండా చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అయినా ఈ విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమవుతుందని విమర్శలు చేశారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

 

ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అలాగే అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version
Skip to toolbar