Dharani portal: ధనం కోసమే ధరణి పోర్టల్

కోట్ల రూపాయల భూమిని సొంతం చేసుకొనేందుకే ధరణీ పోర్టల్ తెచ్చారని భాజాపా ఎమ్మెల్యే ఈటెల రాజేంధర్ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ధ్వజమెత్తారు

Etela Rajendar: కోట్ల రూపాయల భూమిని సొంతం చేసుకొనేందుకే ధరణీ పోర్టల్ తెచ్చారని భాజాపా ఎమ్మెల్యే ఈటెల రాజేంధర్ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

వేల ఎకరాలను అప్పనంగా కొట్టేసేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని దుయ్యబట్టారు. వెంటనే పోర్టల్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ కుటుంబసబ్యుల పేర్లతో ఖరీదైన భూములు రిజిష్ట్రేషన్ అవుతున్నాయని మాజీ మంత్రి  ఈటెల ఆరోపించారు.